Posted on 2023-09-17 13:14:45
డైలీ భారత్: ఈరోజు స్థానిక శివనగర్ బాయ్స్ హై స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై అవార్డు పొందిన కొత్వాల్ ప్రవీణ్ ని ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ మాట్లాడుతూ కొత్వాల్ ప్రవీణ్ తను పనిచేసే వీర్నపల్లి మండలం రంగంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు విద్య అందించే వారని అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పండగల రోజును కూడా విభిన్నంగా పాఠశాలలో పిల్లలతో జరిపించేవాడు. అలాగే పాఠశాలలో కలర్స్ డే,మట్టి వినాయకుల తయారీ, రాఖీల తయారి పిల్లలచే చేపించేవాడు సైన్స్ ఫెయిర్ లో మరియు టిఎల్ఎం మేళాలో మండల జిల్లా స్థాయి బహుమతులను కూడా గెలుచుకున్నారు అని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు మాట్లాడుతూ అన్ని విధాలుగా అర్హుడని ప్రవీణ్ కి ఈ అవార్డు రావడం సరియైనదని పిల్లలకు నాణ్యమైన విద్య బోధించడంలో ముందుంటారని అలాగే ఇలాంటి ఎన్నో అవార్డు రావాలని కోరుకున్నారు.
TSUTF జిల్లా కార్యదర్శి గా పనిచేస్తున్న ప్రవీణ్ కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జిల్లా ఉపాధ్యాయులకు గర్వకారణం.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం పరకాల రవీందర్ ఆడేపు శివ, పాముల స్వామి గౌడ్, వంగ మల్లేశం, నరేష్ పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >