Posted on 2026-02-26 07:44:52
ఫరీద్పేట్ గ్రామంలో 24 సీసీ కెమెరాలను ప్రారంభించిన కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: మాచారెడ్డి మండలంలోని ఫరీద్పేట్ గ్రామంలో గ్రామస్తులు మరియు గ్రామ పాలకవర్గం సంయుక్తంగా సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి గారు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఏఎస్పీ గారు, గ్రామ భద్రత కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అభినందనీయమని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసుల పనితీరుతో సమానమని, ఇది గ్రామ భద్రతకు నిరంతరం నిఘా ఉంచే ‘మూడో కన్ను’ లాంటిదని పేర్కొన్నారు. గ్రామంలోకి వచ్చే కొత్త వ్యక్తుల కదలికలు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఏదైనా నేర సంఘటన జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయడంలో ఈ కెమెరాల దృశ్యాలు పోలీసులకు బలమైన సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని, తద్వారా నేరస్థుల్లో భయం పెరిగి నేరాలు తగ్గుముఖం పడతాయని వివరించారు.
అనంతరం arrive alive కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించిన ఏఎస్పీ , వాహనదారులు ముఖ్యంగా యువత తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం, అజాగ్రత్త కారణంగా అమూల్యమైన ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాకుండా, మన ప్రాణ రక్షణ కోసం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించి, తమ గ్రామ భద్రతలో భాగస్వాములుగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ భద్రత కోసం స్వచ్ఛందంగా నిధులు సమకూర్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన గ్రామస్తుల చొరవను ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా, ఫరీద్పేట్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామస్తుల సామాజిక బాధ్యతను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు మరియు పోలీస్ శాఖ పరస్పర సహకారంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఇతర గ్రామాలు కూడా ఫరీద్పేట్ను ఆదర్శంగా తీసుకొని తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >