Posted on 2026-02-25 19:01:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఫరూక్ నగర్ మండలం చింతగూడ గ్రామ పరిధిలోని శ్రీబాలాజీ పౌల్ట్రీ ఫామ్లో టికెదార్గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఆత్మ మహతో తన స్వరాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి బూర్గుల, కాశిరెడ్డిగూడ, చింతగూడ, బాలానగర్, షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్టు సమాచారం అందింది.పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ బృందం 24 ఫిబ్రవరి సాయంత్రం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆత్మ మహతోను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1.7 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో సహకరిస్తున్న బీహార్కు చెందిన సుశీల్ కుమార్, ప్రేమ్ రామ్లను కూడా అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురిని షాద్ నగర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించగా, కోర్టు ఆదేశాల మేరకు 25 ఫిబ్రవరి న రిమాండ్కు తరలించారు.
ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎ. బాలరాజు, ఎస్సై కె. వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు..
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
Posted On 2026-02-25 20:05:29
Readmore >
మాజీ ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం,కౌన్సిలర్ పెంటయ్య,మురళీమోహన్
Posted On 2026-02-25 20:04:26
Readmore >
బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-25 19:05:14
Readmore >
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా పిలుపు
Posted On 2026-02-25 18:56:40
Readmore >
ఢిల్లీలో పిసిసి చైర్పర్సన్ సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క
Posted On 2026-02-25 18:54:19
Readmore >
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి : లకావత్ గిరిబాబు
Posted On 2026-02-25 18:49:51
Readmore >