| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు – 163 BNSS (సెక్షన్ 144) అమలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జూనియర్ కలశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్న్నారు.పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ సిబ్బంది ఉన్నారు.

Previous ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులు : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శుభాకాంక్షలు
Next బాసర : ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
ADVERTISEMENT