Posted on 2026-02-19 18:00:38
శంషాబాద్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసిన డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ శంషాబాద్ జోన్ పరిధిలో రాళ్లగూడ రోడ్డులో నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్దం చేసిన ఏబీవీ రీలైఫ్ హాస్పిటల్ వివాదంలో చిక్కుకుంది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్తో డాక్టర్గా చలామణి అవుతున్న ఆనంద్ కుమార్పై చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్న డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో (టిజిఎంసి) కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆనంద్ కుమార్ చిట్పల్లి అనే వ్యక్తి డాక్టర్ పేరుతో చలామణీ కావడమే కాకుండా గతంలో షాద్ నగర్లో హాస్పిటల్ తెరిచి వైద్యం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.అక్కడ వైద్యుల ఫిర్యాదుతో ఆనంద్ కుమార్ పైన కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడు శంషాబాద్లోనీ రాళ్లగూడ రోడ్డులో ఏబీబీ రీ లైఫ్ పేరుతో హాస్పిటల్ను ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎలాంటి మెడికల్ డిగ్రీ సర్టిఫికెట్ లేకపోయినా డాక్టర్ పేరు పెట్టుకుని ప్రజలను, అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నాడని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని.. అందువల్ల ఆయన ఎలాంటి వైద్య సేవలు కొనసాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని డీసీపీకి సూచించారు.ఆయనపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అమరేందర్, శంషాబాద్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ట్రెజరర్ ఐఎంఏ సంతోష్ కుమార్, వేణుగోపాల్ శివకాంత్ శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. డాక్టర్ అమరేందర్ మాట్లాడుతూ... ఐఎంఏ శంషాబాద్ నుంచి తన పేరు వాడుకున్నాడని, తాను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎలాంటి డిగ్రీ లేనటువంటి వారికి ప్రోత్సాహం చేయడం సరైంది కాదని ఆయన చెప్పారు. పూర్తి విచారణ చేసి నిజా నిజాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శంషాబాద్ డీసీపీ రాజేష్కి ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.
అర్హతలు లేకున్నా వైద్యుడిగా చలామణి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-02-19 18:00:38
Readmore >
"కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-02-19 09:39:39
Readmore >
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన లావుడ్యా సత్యనారాయణ నాయక్
Posted On 2026-02-19 09:34:26
Readmore >
మార్చి నెలాఖరు లోపు ప్రకటన బోర్డుల పెండింగ్ పన్నులు చెల్లించండి : కమిషనర్ ఎన్. మౌర్య, ఐఏఎస్
Posted On 2026-02-19 06:46:33
Readmore >
ప్రతి వార్డును ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తాం : మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం
Posted On 2026-02-18 16:27:28
Readmore >
70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ చేజర్ల లైన్ మెన్ నాగేంద్ర బాబు
Posted On 2026-02-18 15:18:23
Readmore >