Posted on 2026-02-19 06:46:33
డైలీ భారత్, తిరుపతి: పెండింగ్ లో ఉన్న ప్రకటన బోర్డుల పన్నులు మార్చి నెలాఖరు లోపు చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ ప్రకటన సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
ప్రకటన బోర్డుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు, తదితర విషయాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. నూతన ప్రకటన పన్నుల జీఓ గురించిన విధానాలను వివరించారు
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారనే పిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన వాటికి ఇప్పటికి పన్నులు చెల్లించడం లేదన్నారు. మార్చి 31 లోపు అన్ని పన్నులు చెల్లించకుంటే బోర్డులు తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. కొత్తగా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నా తప్పనిసరిగా నగరపాలక సంస్థ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిసిపీ ఖాన్, టిపిఓ మధు, తదితరులు పాల్గిన్నారు.
#MCT #hordings #Tirupati #maud_municipal #cdma_municipal #tsccl
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >