Posted on 2026-02-18 20:57:28
28వ వార్డు లో యువ నేత కబీర్ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గానికి ఘన సన్మానం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం అన్నారు. బుధవారం పట్టణంలోని 28వ వార్డులో యువ నేత కబీర్ ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి అధ్యక్షతన నూతన మున్సిపల్ పాలక వర్గానికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ బస్వం, కౌన్సిలర్లు రిజ్వనాబేగం ముబారక్, పెంటయ్య, రాజు నాయక్, ప్రవీణ్, మరియాంబేగం సాధిక్, మురళి మోహన్ (అప్పి), బచ్చలి నరేష్, నజీయాబేగంసర్వర్ పాష, శిరీష అనిల్, దిలీప్ కుమార్ లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ... వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువత, స్థానిక నాయకుల సహకారంతో వార్డులను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కబీర్ మాట్లాడుతూ...తమ వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ, చైర్మన్ ఇతర సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, సీనియర్ నాయకులు ఇబ్రహీం, మన్సుర్, మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు సఖిబ్, నాయకులు హలీం, జాఫర్ ఖాన్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ అప్ప, జలజ, నాగరాజు, జాహిర్ ఖాన్, ఆసిమ్, సురేష్, డాక్టర్ ప్రేమ్ కుమార్, పరమేశ్వర్, సురేష్, తిరుపతి రెడ్డి, ఇలియాజ్, కిరణ్, రఘు, కొన దేవయ్య కృష్ణ, నవనీత్, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >