Posted on 2026-02-18 12:30:16
డైలీ భారత్ డెస్క్: పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.ఏప్రిల్ నెలలో వివిధ తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్ నెలల్లో ముగియనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటనలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించారు. అసోంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ఒకే దశలో నిర్వహించారు. కాగా ఇప్పటికే పుదుచ్ఛేరిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత ఫిబ్రవరి 14న తుది జాబితాను ప్రకటించారు. తమిళనాడులో మంగళవారం, కేరళలో ఈ నెల 21న ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 28న ప్రచురించనున్నారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >