Posted on 2026-02-10 14:23:27
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్,ఇల్లందు ,అశ్వారావుపేట మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.ఇందులో భాగంగా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు.అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 1200 మందితో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలింగ్ కేంద్రాల పరిసరాలలో నిరంతర నిఘా కొరకు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రమైన పాల్వంచ అనుబోస్ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్,బాంబుస్క్వాడ్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 14:32:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 14:23:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 13:03:20
Readmore >