Posted on 2026-02-10 18:53:27
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్,ఇల్లందు ,అశ్వారావుపేట మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.ఇందులో భాగంగా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు.అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 1200 మందితో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలింగ్ కేంద్రాల పరిసరాలలో నిరంతర నిఘా కొరకు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రమైన పాల్వంచ అనుబోస్ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్,బాంబుస్క్వాడ్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ
Posted On 2026-03-09 19:09:41
Readmore >