Posted on 2026-02-10 19:02:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ నుంచి పలు పరికరాలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ గా తీర్చిదిద్దగా.. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆ వాహనంలోని ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ విత్ డీఫిబ్రీలేటర్, మానిటర్ తదితర అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అత్యవసర సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి తొందరగా చేరుకోని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని సిబ్బంది కి తెలియజేశారు. అనంతరం వాహనంలోని రికార్డులను పరిశీలించి ఇబ్బంది యెక్క పనితీరును ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్ కుమార్, పోచంపల్లి పర్శరాములు, తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >