Posted on 2026-02-10 14:32:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ నుంచి పలు పరికరాలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ గా తీర్చిదిద్దగా.. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆ వాహనంలోని ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ విత్ డీఫిబ్రీలేటర్, మానిటర్ తదితర అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అత్యవసర సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి తొందరగా చేరుకోని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని సిబ్బంది కి తెలియజేశారు. అనంతరం వాహనంలోని రికార్డులను పరిశీలించి ఇబ్బంది యెక్క పనితీరును ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్ కుమార్, పోచంపల్లి పర్శరాములు, తదితరులు పాల్గొన్నారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 14:32:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 14:23:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 13:03:20
Readmore >