Posted on 2026-02-10 19:02:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ నుంచి పలు పరికరాలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ గా తీర్చిదిద్దగా.. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆ వాహనంలోని ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ విత్ డీఫిబ్రీలేటర్, మానిటర్ తదితర అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అత్యవసర సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి తొందరగా చేరుకోని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని సిబ్బంది కి తెలియజేశారు. అనంతరం వాహనంలోని రికార్డులను పరిశీలించి ఇబ్బంది యెక్క పనితీరును ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్ కుమార్, పోచంపల్లి పర్శరాములు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-10 12:06:47
Readmore >
ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు
Posted On 2026-03-10 11:54:35
Readmore >
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >