| Daily భారత్
Logo




మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

News

Posted on 2026-02-10 18:50:29

Share: Share


మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

స్పీడ్ బ్రేకర్లు, మోరీలు లేక నిత్యం రోడ్డు ప్రమాదాలు

తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల డిమాండ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలం మల్లెల మడుగు మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి (ఆర్‌అండ్‌బీ రోడ్డు)పై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మల్లెల మడుగు సరిహద్దులోని సర్గం పాలన చింత చెట్టు వద్ద ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అలాగే కలవట్ల వద్ద మోరీలు లేకపోవడం వల్ల వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ప్రతి రోజూ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు అంటున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, మోరీలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు

Image 1

“LSRW" నైపుణ్యాలతో ఆంగ్ల భాషలో అద్బుత అవకాశాలు

Posted On 2026-03-09 20:25:04

Readmore >
Image 1

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-09 20:20:14

Readmore >
Image 1

ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-09 19:45:58

Readmore >
Image 1

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష...

Posted On 2026-03-09 19:25:55

Readmore >
Image 1

మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్

Posted On 2026-03-09 19:22:17

Readmore >
Image 1

కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి

Posted On 2026-03-09 19:20:29

Readmore >
Image 1

ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి

Posted On 2026-03-09 19:19:18

Readmore >
Image 1

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Posted On 2026-03-09 19:17:48

Readmore >
Image 1

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ

Posted On 2026-03-09 19:09:41

Readmore >
Image 1

మద్యం మత్తులో వాహనం నడిపితే… జైలు జీవితం తప్పదు!

Posted On 2026-03-09 19:08:37

Readmore >