Posted on 2026-02-09 19:41:49
హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్ష.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూంలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేములవాడ, కొండాపూర్, మద్దికుంట, బద్దెనపల్లి, తంగళ్ళపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా వాటిపై సమీక్షించారు. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో ఆరా తీశారు. ఆయా ఇండ్ల పనులను గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టి ..త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సాజిద్, ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >