Posted on 2026-02-09 19:41:49
హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్ష.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూంలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేములవాడ, కొండాపూర్, మద్దికుంట, బద్దెనపల్లి, తంగళ్ళపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా వాటిపై సమీక్షించారు. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో ఆరా తీశారు. ఆయా ఇండ్ల పనులను గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టి ..త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సాజిద్, ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >