Posted on 2026-02-09 15:11:49
హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్ష.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూంలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేములవాడ, కొండాపూర్, మద్దికుంట, బద్దెనపల్లి, తంగళ్ళపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా వాటిపై సమీక్షించారు. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో ఆరా తీశారు. ఆయా ఇండ్ల పనులను గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టి ..త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సాజిద్, ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 14:32:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 14:23:27
Readmore >