Posted on 2026-02-09 18:02:32
ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆద్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారం సంద ర్భంగా రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సభ్యుల సమక్షంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జనాభాలోని వివిధ వర్గాలలో ఆర్థిక అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారాన్ని అమలు చేస్తుందని వివరించారు. ఈ నెల 09 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కేవైసీ - సురక్షిత బ్యాంకింగ్కు మీ మొదటి అడుగు అనే థీమ్తో పాటించాలని ప్రతిపాదించారని తెలిపారు. నో యువర్ కస్టమర్ (కేవైసీ), సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ (సీకేవైసీ కేవైసీ సంబంధిత మోసాలు మనీ మ్యూలింగ్కు వ్యతిరేకంగా జాగ్రత్తలతో సహా, ఖాతా క్రమశిక్షణను పాటించడం, ప్రజలలో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) సమన్వయంతో జిల్లాస్థాయిలో అనేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఆర్బీఐ, బ్యాంకులు ఎప్పుడూ మెయిల్లు, ఎస్ఎంఎస్ లు పంపదు లేదా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లు మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని అడిగే కాల్లు చేయదని స్పష్టం చేశారు. వివిధ సోషల్ మీడియాల ద్వారా మొబైల్ ఫోన్లకు వచ్చే ఆఫర్లు, లింకులు, ఫోన్లకు స్పందించ వద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు ఉన్నారు.
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >