Posted on 2026-01-26 21:48:53
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార పార్టీ నేతలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రంలో బల్దియా ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రానున్నారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభనిర్వహించేందుకు నిజామాబాద్ రూరల్ మండలం కేశపూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ నెల 27,28న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో రానుండటంతో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన దాదాపు ఖాయమైనట్లు అధికార పార్టీ నాయకులు ఆ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇది వరకు జిల్లాల పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రాకపోవడంతో బల్దియా ఎన్నికల ప్రచారం కోసం రప్పిస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >