Posted on 2026-08-10 18:28:25
డైలీ భారత్, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 02 కార్లు, 01 ఆటో రిక్షా, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత నాణేలు, 06 కిలోల బొగ్గు, 04 కిలోల మట్టి, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29) ఉన్నారు. ప్రధాన నిందితుడు మునావర్పై గతంలో బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఒక చీటింగ్ కేసు నమోదైంది.
నేరం చేసిన తీరు: మునావర్ తనకు గుప్త నిధులను గుర్తించి వెలికితీసే ప్రత్యేక విద్య ఉందని నమ్మించి, అమాయకులను లక్ష్యంగా చేసుకునేవాడు. నిందితులు ముందుగా గుంత తీయించి, అందులో బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేల సంచిని రహస్యంగా ఉంచేవారు. అనంతరం పూజలు నిర్వహించి, బొగ్గు బంగారంగా మారేందుకు సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఈ విధంగా సుమారు 11 మందిని మోసం చేసి రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి.
ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం. 916/2026, BNS సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు విజ్ఞప్తి: గుప్త నిధులు వెలికితీస్తామని, ప్రత్యేక శక్తులు ఉన్నాయని చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దు. ఇటువంటి మోసపూరిత లేదా అక్రమ కార్యకలాపాల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.
ఈ కేసును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి, ఎస్ఐలు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు మరియు సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఛేదించారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >