Posted on 2026-01-05 20:49:41
రూ.2,50,000 బాండ్ అందించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం ద్వారా మంజూరైన కులాంతర వివాహ ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన జక్కుల ప్రియాంక కులాంతర వివాహం చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహక కోసం ఎస్సీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకు న్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి మంజూరు అయిన రూ. 2,50,000 విలువైన ఫిక్స్డ్ బాండ్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో సోమవారం జక్కుల ప్రియాంక కు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. జిల్లాలో ఇప్పటిదాకా 180 దరఖాస్తులు రాగా, 57 మందికి రూ.1 కోటి 42 లక్షల 60 వేలు పంపిణీ చేశా మని, మరో 11 మందికి త్వరలో నే ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్లను పంపిణీ చేస్తామని, మిగతా వారికి ఎస్సీ కమిషన ర్ నుంచి మంజూరు అయిన తర్వాత ఇస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >