Posted on 2026-01-05 20:44:44
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం...కారు ఢీకొని హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలోని క్రషర్ వద్ద వేగంగా వచ్చిన కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి కారు ఢీకొట్టడం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టగా, బైక్పై ప్రయాణిస్తున్న హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, పట్టణ సిఐ కృష్ణలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ, స్వయంగా పోలీస్ వాహనంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉంటూ తోటి సిబ్బందిని కోల్పోవడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >