Posted on 2026-01-03 17:53:22
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే నేటితరం ఉపాధ్యాయులకు, మహిళలకు ఆదర్శ ప్రాయమని, ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదనరెడ్డి రెడ్డి పేర్కొన్నారు. శనివారం షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సావిత్రి బాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుండాల అశోక్,ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తాతో కలిసి ఆయన ముఖ్య అతిధులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం వల్లే నేడు మహిళలు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు. పురుషులకంటే దీటుగా పనిచేయగలుగుతున్నారు. నింగి నుంచి నేల వరకు ప్రతి విభాగంలోనూ సత్తా చాటుతున్నారు. మహిళల్లో అసమానతలను రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే విశేషంగా కృషి చేశారు అని అన్నారు.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >