Posted on 2025-12-28 13:41:44
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రను కాంగ్రెస్ పార్టీయే పోషించిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఆదివారం 140వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలాపూర్ చౌరస్తా, ఆర్కేపురం, సరూర్ నగర్ ప్రాంతాల్లో మూడు రంగుల జెండాను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎగరేశారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ కార్యకలాపాల్లో భారతీయుల పాత్ర లేకుండా బ్రిటీష్, రాజులు, నిజాం నవాబుల పాలన కొనసాగిందని గుర్తు చేశారు.తుపాకులతో కాకుండా అహింస సిద్ధాంతంతో స్వాతంత్య్ర సాధించాలని నాటి కాంగ్రెస్ పెద్దలు భావించి ఉద్యమించారని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని తెచ్చిందే కాంగ్రెస్ రాష్ట్రం, దేశంలోనే సాగునీటి ప్రాజెక్టులను కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు అని ఆయన తెలిపారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.బీదలు, బడుగు బలహీన వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >