| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగుల నిరాహార దీక్షలు

News

Posted on 2025-12-24 20:02:32

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగుల నిరాహార దీక్షలు

తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జెఎసి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి సత్య నారాయణ  

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంయుక్త కార్యచరణ సమితి రాష్ట్ర పిలుపుమేరకు    2024  మార్చి నుండి  ఇప్పటివరకు  ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం అధ్యక్షతన నిరాహార దీక్ష కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాకలెక్టర్ ఆఫీస్ ఎదుట చేపట్టడం జరిగింది

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి  తులసి సత్యనారాయణ   మాట్లాడుతూ2024 మార్చ్ నుండి దాదాపు 21 మాసంలు గడిచినా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జిపిఎఫ్, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమిటే షన్  మరియు  గ్రాచూ టీ  ప్రభుత్వం నుండి అందలేదని అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావలసిన బకాయిలు అందక తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలో దాదాపు   32 మంది ఉద్యోగస్తులు బకాయిలు రాక మానసిక ఆవేదనకు గురై మరణించారని తెలిపారు. ఇట్టి ప్రయోజనాల విషయమే ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన, నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టిన  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. అందుకే ప్రభుత్వం పై ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయలు చెల్లింపు కొరకు  ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈరోజు   అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

 ఈ సందర్భంగా జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం  మాట్లాడుతూ  రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని అవసరమైతే హైదరాబాదులో అమర ణ నిరాహార దీక్ష చేపడతామని వారు తెలిపారు.

 ఇట్టి నిరాహార దీక్ష కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాన పెళ్లి  పరమేష్, జిల్లా ఉపాధ్యక్షులు వంగ సుధాకర్, జన పాల వెంకటయ్య కోశాధికారి ధర్మయ్య, సంఘ సభ్యులు ఎస్ఆర్జే వెంకటేశ్వర్లు ప్రభాకర్, సాన రవీందర్, కుబేర స్వామి, రెహమాన్, రిటైడ్ పి జి హెచ్ ఎం తిరుపతి, అమీరుద్దీన్,  చొప్పదండి రవీందర్, రాఘవేంద్రరావు, గడీల   రమేష్,రిటైర్డ్ సిడిపిఓ  ఆనందిని, కే జయశ్రీ,  ఘీభావం తెలిపిన వివిధ సంఘాల నాయకులు భాగ్యరేఖ నెహ్రు నగర్ పి జి హెచ్ ఎం., హరి ప్రసాద్ ఎస్ జి టి సంఘ జిల్లా అధ్యక్షుడు, చేపూరి శ్రీనివాస్ జిల్లా హెల్త్ గెజిటెడ్ సంఘం అధ్యక్షుడు, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాలరామనాథ్, తపస్సు జిల్లా అధ్యక్షుడు జయకృష్ణ, ఎస్సీ ఎస్టీ సంఘమం జిల్లా అధ్యక్షుడు పిట్టల దేవరాజ్, డిటిఎఫ్ జిల సుధాకర్ రెడ్డ, బి టి ఎఫ్ జిల్లా సంఘ  బాధ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు


Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >