Posted on 2025-12-24 15:32:32
తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి సత్య నారాయణ
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంయుక్త కార్యచరణ సమితి రాష్ట్ర పిలుపుమేరకు 2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం అధ్యక్షతన నిరాహార దీక్ష కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాకలెక్టర్ ఆఫీస్ ఎదుట చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ మాట్లాడుతూ2024 మార్చ్ నుండి దాదాపు 21 మాసంలు గడిచినా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జిపిఎఫ్, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమిటే షన్ మరియు గ్రాచూ టీ ప్రభుత్వం నుండి అందలేదని అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావలసిన బకాయిలు అందక తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలో దాదాపు 32 మంది ఉద్యోగస్తులు బకాయిలు రాక మానసిక ఆవేదనకు గురై మరణించారని తెలిపారు. ఇట్టి ప్రయోజనాల విషయమే ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన, నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. అందుకే ప్రభుత్వం పై ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయలు చెల్లింపు కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని అవసరమైతే హైదరాబాదులో అమర ణ నిరాహార దీక్ష చేపడతామని వారు తెలిపారు.
ఇట్టి నిరాహార దీక్ష కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాన పెళ్లి పరమేష్, జిల్లా ఉపాధ్యక్షులు వంగ సుధాకర్, జన పాల వెంకటయ్య కోశాధికారి ధర్మయ్య, సంఘ సభ్యులు ఎస్ఆర్జే వెంకటేశ్వర్లు ప్రభాకర్, సాన రవీందర్, కుబేర స్వామి, రెహమాన్, రిటైడ్ పి జి హెచ్ ఎం తిరుపతి, అమీరుద్దీన్, చొప్పదండి రవీందర్, రాఘవేంద్రరావు, గడీల రమేష్,రిటైర్డ్ సిడిపిఓ ఆనందిని, కే జయశ్రీ, ఘీభావం తెలిపిన వివిధ సంఘాల నాయకులు భాగ్యరేఖ నెహ్రు నగర్ పి జి హెచ్ ఎం., హరి ప్రసాద్ ఎస్ జి టి సంఘ జిల్లా అధ్యక్షుడు, చేపూరి శ్రీనివాస్ జిల్లా హెల్త్ గెజిటెడ్ సంఘం అధ్యక్షుడు, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాలరామనాథ్, తపస్సు జిల్లా అధ్యక్షుడు జయకృష్ణ, ఎస్సీ ఎస్టీ సంఘమం జిల్లా అధ్యక్షుడు పిట్టల దేవరాజ్, డిటిఎఫ్ జిల సుధాకర్ రెడ్డ, బి టి ఎఫ్ జిల్లా సంఘ బాధ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
తాడ్వాయి మండలంలోని కరడ్పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >