| Daily భారత్
Logo




పక్కా సమాచారంతో తాళాలు పగలగొట్టి దోచుకెళ్లారు

News

Posted on 2025-12-24 15:24:53

Share: Share


పక్కా సమాచారంతో  తాళాలు పగలగొట్టి దోచుకెళ్లారు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పక్కా సమాచారంతో పకడ్బందీగా తెల్లవారుజామున తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని ఏ సమయంలో ఎక్కడికి వెళ్తాడో గ్రహించి ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 5 లక్షల నగదు, 4 తులాల బంగారం, కిలోన్నర వెండి దోచుకెళ్లారు. బాధితుడు వన్నాడ అశోక్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షాద్ నగర్ మున్సిపాలిటీ గంజ్ రోడ్ లో నివాసముంటున్న అశోక్ తన పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాదుకు కుటుంబాన్ని తరలించారు. పట్టణంలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే అశోక్ గౌడ్ వారంలో ఒకటి రెండు రోజులు హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. సోమవారం సాయంత్రం ఎప్పటిలాగే హైదరాబాద్ కు వెళ్లి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన అశోక్ గౌడ్ ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉండడం చూసి దొంగతనం అయిందని గ్రహించాడు. బీరువాలో దాచిన రూ. 5 లక్షల నగదు, 4 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ కీ గురైందని గ్రహించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దొంగ ధ్వంసం చేశాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడగా, ఓ మహిళ కాపలాగా ఉన్నట్టు కాలనీ లోని పలు సీసీ కెమెరాలో నమోదయింది. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలను సేకరించింది.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >