Posted on 2025-12-21 20:24:50
రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదంపై హర్షం
మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల న్యూ పెన్షనర్స్ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ ఉద్యోగుల, మేధావుల విద్యావంతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరై మాట్లాడుతూ బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల ఉద్యోగస్తులపై వివక్షత కొనసాగుతుందన్నారు. ఉన్నత వర్గాల వారు గ్రామాల్లోని సామాన్య ప్రజల విద్యకు, ఉద్యోగానికి, అధికారానికి దూరం చేస్తూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాచీన కాలంనాటి బానిస సాంస్కృతిని మనపై రుద్దే ప్రయత్నం మనువాదులు ముమ్మురం చేస్తూ దారిద్ర్యం లోకి నేడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీలు సంఘటిత మై చారిత్రక,సామాజిక సాంస్కృతిక,రాజకీయ వారసత్వాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటి పై ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె.రాజేందర్, అడ్వకేట్ రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్.నాగభూషణం, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్య వంశీధర్, డాక్టర్ చిలుక భాస్కర్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >