Posted on 2026-08-03 14:16:26
డైలీ భారత్, చంద్రంపేట: సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో ఆషాడ మాస బోనాల పండుగను అంగరంగ వైభవంగా సోమవారం రోజున జరుపుకున్నారు. అమ్మవారి వేషధారణలో విద్యార్థినిలు, పోతురాజు వేషధారణలో అబ్బాయిలు ఈ బోనాల పండుగలో పాల్గొన్నారు. ఉపాధ్యాయునిలు, విద్యార్థినిలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి , సమృద్ధిగా వర్షాలు కురవాలని, చేతినిండా పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు చంద్రంపేట పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చక్కని విద్యాబుద్ధులు, సత్ప్రవర్తన నేర్చుకుంటారని ,మంచి ఫలితాలను సాధిస్తారని , ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని భవిష్యవాణి పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి పాటలకు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలలో స్థానిక కౌన్సిలర్ మొగిలి నాగరాజు,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ, ఏఏపీసీ చైర్ పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, ముంజ రమ,ఓద్యారం మధుసూదని,అనిల్ కుమార్,మిరియం, త్రివేణి , లత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >