Posted on 2025-12-21 20:23:54
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక ఆదర్శనగర్ లో గల నగర మేరు సంఘ భవనంలో మేరు కుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల కాల పరిమితి కొరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటుపడుతున్న అధ్యక్ష అభ్యర్థులు మాట్లాడుతూ నగరంలోని 10 తర్పల పరిధిలో సుమారు 11 వందల కుటుంబాలు ఉన్నాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుటుంబానికి రెండు ఓట్ల చొప్పున ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. మేరు కులస్తుల ఐక్యత, అభివృద్ధి కొరకు పాటుపడడమే తమ లక్ష్యంగా భావిస్తున్నామని కత్తెర గుర్తు అధ్యక్ష అభ్యర్థి కొట్టూరు దేవదాస్ చెప్పారు. అలాగే రాజకీయంగా విద్య ఉద్యోగ రంగాల్లో తమ కులస్తులు ముందుండేలా చూస్తామని తెలియజేశారు. విద్యార్థులకు వారిలోని ప్రతిభా పాటవాలకు గుర్తించి ప్రోత్సహిస్తామని, నిరుపేద మేరు కులస్తుల అంత్యక్రియలకు 2000 రూపాయలు ఆర్థిక సహాయం తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. అలాగే వివాహ యోగ్యులైన యువతీ యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక ను ఏర్పాటు చేస్తామని, నగరంలోని 10తర్పలలో భవనాల నిర్మాణానికి స్థల సేకరణ ఆర్థిక సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >