Posted on 2025-12-21 19:10:10
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: కోర్టు కేసుల పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి,రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ కర్ణ కుమార్ అన్నారు.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో గల అన్ని కోర్ట్ ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడమైనది అన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ కర్ణ కుమార్ మాట్లాడుతూ జాతీయ లోకాదాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు,ఈ లోకదాలత్ లో సెటిల్ చేసుకోవడం ద్వారా తాము సివిల్ కేసులలో చెల్లించిన కోర్ట్ ఫీస్ కూడా తిరిగి పొందొచ్చు అని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి జి.అనూష మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాలలో 25 లోక్ అదాలత్ బెంచిలు ఏర్పాటు చేశామని ఇందులో రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులు ,సివిల్ దావాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, కన్జ్యూమర్ కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకొన్నారు అని చెప్పారు.అలాగే అన్ని కేసులలో కలిపి రూ.106,341,411/- రూపాయల వరకు నష్ట పరిహారాన్ని కక్షిదారులకు ఇప్పించడం జరిగింది.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >