Posted on 2025-12-16 16:48:39
మేళ్లచెరువు మండల కేంద్రంలో భారీగా డంప్ చేసిన నూనె, బియ్యం
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:సూర్యాపేట జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత ఎన్నికలు డబ్బు,మద్యం, మాంసం చుట్టూనే తిరుగుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పాలకీడు, నేరేడు చర్ల, గరిడేపల్లి మట్టంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మందు,మనీ, మాంసంతో ప్రలోభాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసి నిల్వలు చేసుకున్నారని సమాచారం. మేళ్లచెరువు మండల కేంద్రం లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నూనె డబ్బాలు,బియ్యం సంచులు, మందు బాటిల్స్ భారీగా డంప్ చేసినట్లు మేళ్లచెరువు ప్రజలు గుసగుస లాడుతున్నారు. మూడో విడత ఎన్నికల వేళ మంగళవారం రాత్రి పరిస్థితి మరింత దిగజారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులకే కాకుండా వార్డు సభ్యులు కూడా మందు, మనీ పంపిణీలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదట. ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోతారా? లేక ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటారా? ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచిన ఈ ఎన్నికల తీర్పు రేపు వెలువడనుంది.
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >