Posted on 2025-12-16 21:18:39
మేళ్లచెరువు మండల కేంద్రంలో భారీగా డంప్ చేసిన నూనె, బియ్యం
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:సూర్యాపేట జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత ఎన్నికలు డబ్బు,మద్యం, మాంసం చుట్టూనే తిరుగుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పాలకీడు, నేరేడు చర్ల, గరిడేపల్లి మట్టంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మందు,మనీ, మాంసంతో ప్రలోభాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసి నిల్వలు చేసుకున్నారని సమాచారం. మేళ్లచెరువు మండల కేంద్రం లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నూనె డబ్బాలు,బియ్యం సంచులు, మందు బాటిల్స్ భారీగా డంప్ చేసినట్లు మేళ్లచెరువు ప్రజలు గుసగుస లాడుతున్నారు. మూడో విడత ఎన్నికల వేళ మంగళవారం రాత్రి పరిస్థితి మరింత దిగజారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులకే కాకుండా వార్డు సభ్యులు కూడా మందు, మనీ పంపిణీలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదట. ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోతారా? లేక ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటారా? ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచిన ఈ ఎన్నికల తీర్పు రేపు వెలువడనుంది.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >