డైలీ భారత్ న్యూస్, రామంతపూర్:రామంతపూర్ భగయత్ సాయి కృష్ణ కాలనీలో నెలకొన్న తీవ్రమైన విద్యుత్ సమస్యలపై భూరాడ బాలకృష్ణ ఈరోజు టీఎస్ఎస్పీడీసీఎల్ ఏడీఈని కలిసి వినతి పత్రం అందజేశారు.
కాలనీలో గత కొంతకాలంగా తక్కువ వోల్టేజ్, తరచు విద్యుత్ అంతరాయాలు, సింగిల్ ఫేజ్ సరఫరా కారణంగా గృహోపకరణాలు దెబ్బతినడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, త్రీఫేస్ విద్యుత్ లైన్, అలాగే అవసరమైన విద్యుత్ స్తంభాలు సాంక్షన్ చేసి ఏర్పాటు చేయాలని బాలకృష్ణ ఏ డి ఇని కోరారు.
విద్యుత్ సరఫరా లోపాల వల్ల వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న వేసవి కాలంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని ఆయన అధికారులకు చెప్పారు . ప్రజల భద్రత, సౌకర్యాల దృష్ట్యా అధికారులు త్వరితగతిన స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.