| Daily భారత్
Logo




దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

Devotional

Posted on 2025-12-09 11:26:29

Share: Share


దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: మీరు తరచూ దేవాలయాల్లో హుండిలో కానుకలు సమర్పిస్తుంటారు. కానీ నిజానికి మన పురాణాల్లో ఎక్కడా ఇలా హుండీలో డబ్బులు వెయ్యమని చెప్పలేదు, దాన ధర్మాలే చెయ్యమన్నారు.

మీ మనసులో కోరిక కోరుకుని దేవుడికి లంచం రూపంలో హుండిలో లక్షలు లక్షలు వేసే రోజులివి. మళ్ళీ ఆ కోరిక నెరవేరాలంటూ అప్లై చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా చేస్తే ఆ దేవుడు కనికరిస్తాడా? మీరు అడిగిన వరాలను సమకూరుస్తాడా?

మరైతే మనం ఏం చేయాలి, ఇలా లక్షలు హుండీలో వేసే కన్నా దేవాలయంలో ఏం సమర్పిస్తే మీకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో చూద్దాం రండి.

ఐతే మనం దేవాలయంలో ఏం సమర్పిస్తే ఏం పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం

తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటవ అధ్యాయం మనకు వివరిస్తుంది.

దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ వ్యవహారాలకు అందరూ సహకరిస్తేనే అది చక్కగా నిర్మాణం సంతరించుకుంటుంది.

అందుకే ఎవరి చేతనైనంతలో వారు సమకూర్చుకోవాలి. దేవాలయాలకు సహాయ సహకారాలు అందిచాలని అంటున్నాయి పురాణాలు.

* దేవాలయ గోడలకు సున్నం వేయడం లాంటివి అలాగే ప్రాగంణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే శ్రీమహావిష్ణువు లోకఫలాలను పొందుతారని పురణాలు చెప్తున్నాయి.

* ఆలయానికి శంఖం లాంటివి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతులుగానే పుడతారు.

* ఆలయానికి గంటను దానం చేస్తే మహ గొప్ప కీర్తివంతుడు అవుతాడు.

* గజ్జెలను, మువ్వలను  దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు.

* ఆలయ ప్రాంగణంలో చల్లధనం కోసం పందిళ్ళు  నిర్మిస్తే కీర్తి పొందడానికి, ధర్మ బుద్ది కలగడానికి కారణమవుతాడు.

* దేవాలయం పై రెపరెపలాడే జెండాలను దానం చేయువాడు సకల పాపాలనుండి విముక్తి పొందినవాడై వాయు లోకాలను పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును దాత పొందుతాడు.

* ఆలయ ప్రాంగణంలో వేదికలను నిర్మించడం వలన పృధ్వీపతి అవుతారు.

* మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని పొందుతాడు.

* నాలుగు కలశాలను దానం చేసిన వాడు 4 సముద్రాలంత పరియంతం ఉన్న, భూమి మీద అంత సుఖాన్ని పొందుతాడు.

* కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు.

* వట్టి వేళ్ళతో తయారు చేసిన చాపలను ఇస్తే సర్వ పాపాలు నశించుకుపోతాయి.

* ఆలయంలో ఉన్న గోమాతలకు గడ్డి, మరి అనేక రకాలైన సదుపాయాలను కల్పించినపాడికి పాపవిముక్తి కలుగును.

* కాపరాలను దానం చేస్తే గొప్ప ధనవంతుడు అవుతాడు.

* ధ్వజ స్థంభాన్ని సమర్పిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు.

* దేవునికి ముఖలేపనాన్ని అంటే ముఖములను తొగిడు సుగంధ ద్రవ్యాలను సమర్పించినవాడు ఉత్తమ రూప సంపదత్తిని పొందుతాడు.

Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >