Posted on 2025-12-09 11:21:25
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: గత కొన్నేళ్లుగా ఎన్నికల ప్రచారంలో వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలు కీలకంగా మారాయి. ప్రస్తుత తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు ఈ మాధ్యమాల్లోకి చొచ్చుకుపోతున్నారు. తొలి దశ పోలింగ్కు ఇక ఎంతో టైం లేకపోవడంతో పోస్టులు, రీల్స్తో సెల్ఫోన్లను మోతమోగిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో తమ ఆలోచనల్ని, హామీలను ప్రతి ఓటరుకు వివరించే టైం ఉండదు. వాట్సప్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో అవన్నీ సులభంగా వివరిస్తున్నారు. క్షణాల్లో వందలు, వేల మందికి వారి ఆలోచనల్ని, హామీలను చేరవేస్తున్నారు. ప్రచార రథాలపై డిజిటల్ తెరల ద్వారానూ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి మెరుపు వేగంతో చొచ్చుకుపోతున్నారు.నిమిషంలోపు ఉండేలా తమ ఆడియో, వీడియో ప్రొఫైల్ రూపొందించి ఓటర్లకు సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు సర్పంచి, వార్డు అభ్యర్థులు. తమ నేపథ్యం, వారు చేసిన సేవలను అందులో తెలియజేస్తున్నారు. 2 నుంచి 3 నిమిషాల నిడివితో హామీలు, మేనిఫెస్టో రీల్స్ను పోస్టు చేస్తున్నారు. వీటితోపాటు తమకు ఓటేయాలంటూ 30 నుంచి 40 సెకన్ల స్పీచ్తో ఆడియో ఫైల్స్ షేర్ చేస్తున్నారు. తనకు ఓటేస్తే గ్రామాన్ని ఎలా మారుస్తామన్నది స్వయంగా వివరిస్తున్నారు. తమ గెలుపుకి సహకరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇళ్లు, గోడలపై పోస్టర్లు తగ్గి పోస్టుల ప్రచారం తారస్థాయికి చేరుతోంది.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >