| Daily భారత్
Logo




సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

News

Posted on 2025-12-09 11:21:25

Share: Share


సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: గత కొన్నేళ్లుగా ఎన్నికల ప్రచారంలో వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలు కీలకంగా మారాయి. ప్రస్తుత తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు ఈ మాధ్యమాల్లోకి చొచ్చుకుపోతున్నారు. తొలి దశ పోలింగ్‌కు ఇక ఎంతో టైం లేకపోవడంతో పోస్టులు, రీల్స్‌తో సెల్‌ఫోన్లను మోతమోగిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో తమ ఆలోచనల్ని, హామీలను ప్రతి ఓటరుకు వివరించే టైం ఉండదు. వాట్సప్‌ మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో అవన్నీ సులభంగా వివరిస్తున్నారు. క్షణాల్లో వందలు, వేల మందికి వారి ఆలోచనల్ని, హామీలను చేరవేస్తున్నారు. ప్రచార రథాలపై డిజిటల్‌ తెరల ద్వారానూ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి మెరుపు వేగంతో చొచ్చుకుపోతున్నారు.నిమిషంలోపు ఉండేలా తమ ఆడియో, వీడియో ప్రొఫైల్‌ రూపొందించి ఓటర్లకు సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు సర్పంచి, వార్డు అభ్యర్థులు. తమ నేపథ్యం, వారు చేసిన సేవలను అందులో తెలియజేస్తున్నారు. 2 నుంచి 3 నిమిషాల నిడివితో హామీలు, మేనిఫెస్టో రీల్స్‌ను పోస్టు చేస్తున్నారు. వీటితోపాటు తమకు ఓటేయాలంటూ 30 నుంచి 40 సెకన్ల స్పీచ్‌తో ఆడియో ఫైల్స్‌ షేర్ చేస్తున్నారు. తనకు ఓటేస్తే గ్రామాన్ని ఎలా మారుస్తామన్నది స్వయంగా వివరిస్తున్నారు. తమ గెలుపుకి సహకరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇళ్లు, గోడలపై పోస్టర్లు తగ్గి పోస్టుల ప్రచారం తారస్థాయికి చేరుతోంది.

Image 1

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం

Posted On 2026-04-17 10:15:59

Readmore >
Image 1

తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!

Posted On 2026-04-17 10:12:49

Readmore >
Image 1

బిక్కవోలులో మహిమాన్విత గణపతి

Posted On 2026-04-17 10:07:37

Readmore >
Image 1

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-04-17 08:50:45

Readmore >
Image 1

అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-17 08:40:22

Readmore >
Image 1

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-17 08:35:45

Readmore >
Image 1

మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Posted On 2026-04-17 08:16:17

Readmore >
Image 1

ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్

Posted On 2026-04-17 08:15:29

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ..

Posted On 2026-04-17 07:41:26

Readmore >
Image 1

హత్య కేసు ఛేదించిన పోలీసులు...

Posted On 2026-04-17 07:29:32

Readmore >