| Daily భారత్
Logo




హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

News

Posted on 2026-06-02 17:17:41

Share: Share


హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా పిఆర్టియు ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని పిఆర్టియు భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అపోహలు వద్దని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు కామారెడ్డి  పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండదని తెలిపారు. ఈ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి 1.5 శాతం కోత విధించారని, ముందస్తు సమాచారం లేకుండా వేతనం కట్ కావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. హెల్త్ కార్డ్ స్కీమ్ అమల్లోకి వస్తే కోత విధించినా ఎలాంటి ఇబ్బంది లేదని, విధివిధానాలు లేకపోవడం, ట్రస్ట్ ఏర్పాటు కాకముందే 1.5 శాతం కట్ కావడంతో గందరగోళం ఏర్పడిందని వివరించారు.

ఇటీవల సీఎస్ రామకృష్ణారావుతో జరిగిన సమావేశంలో ట్రస్ట్ ఏర్పాటుకు 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారని వెల్లడించారు.

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒక్కరి నుంచే 1.5 శాతం కట్ అవుతుందని, జూన్ 10 నుంచి హెల్త్ కార్డ్ స్కీము ద్వారా నగదు రహిత చికిత్స అమలులోకి వస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కేవలం భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తే, ట్రస్ట్ ద్వారా కుటుంబంలో ఆరుగురికి వర్తిస్తుందని పేర్కొన్నారు. 1.5 శాతం కోత ద్వారా ప్రతి నెల ట్రస్టుకు రూ.44 కోట్లు, ప్రభుత్వం తరఫున మరో రూ.44 కోట్లు జమ అవుతాయన్నారు. ఏడాదికి రూ.1,036 కోట్ల నిధులు ట్రస్ట్లో జమ అవుతాయని పేర్కొన్నారు.  పీఆర్టీయూ 54 సంవత్సరాల క్రితం పీఆర్టీయూ ఏర్పడిందని, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అత్యధికంగా డీఏలు బకాయి పడిందని, ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 3 డీఏలు ఇచ్చిందని అన్నారు. 01.07.2023 నుంచి పీఆర్సీ రావాల్సి ఉందని, అందుకే పీఆర్సీ ముందు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అల్జాపూర్ కుషాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నర్సారెడ్డి, కమిటీ సభ్యుడు గోవర్ధన్, హన్మాండ్లు, రాజు, స్వప్న, విజయ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన

Posted On 2026-07-25 07:31:14

Readmore >
Image 1

సాంకేతికతలో పోలీసులే ముందుండాలి...

Posted On 2026-07-25 07:07:57

Readmore >
Image 1

ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు

Posted On 2026-07-25 07:06:03

Readmore >
Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >