Posted on 2026-06-02 16:13:35
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలోని కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి అభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . మలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సందర్భంలో కిష్టయ్య కానిస్టేబుల్ గా కామారెడ్డి విధులు నిర్వహిస్తూ, ఆంధ్రపాలకుల పాలనలో వారు చేస్తున్న ఆకృత్యాలకు విధిస్తున్న నిర్బంధాలకు చలించి, కానిస్టేబుల్ గా తెలంగాణ ఉద్యమకారులను చెదరగొట్టలేక, విధులు నిర్వర్తించలేక తీవ్ర మనస్తాపం చెంది డ్యూటీలో ఉండగానే సెల్ టవర్ ఎక్కి తుపాకీతో కాల్చుకొని అమరుడు అవ్వడం జరిగింది.
శ్రీకాంత్ చారి మరణానికి మూడు రోజుల ముందే మరణించినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్యను తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారుడిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చరిత్రలో తన పేరు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గ్యార అఖిల, కొత్తపల్లి లలిత చిట్టిబాబు,బిసీ సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సభావత్ వినోద్ నాయక్,ఆర్మీ జవాన్ నరేందర్,మదన్, ప్రశాంత్,దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >