Posted on 2025-12-04 21:31:14
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి తెలిపారు. గురువారం నగర శివారులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో నాన్ షెడ్యూల్ 126 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వాటిలోని 64 జనరల్ స్థానాల్లో 32 సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు. బీసీల రిజర్వేషన్లను 51.6 శాతం వరకూ పెంచి సామాజిక న్యాయాన్ని అమలు చేశామని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ–బీఆర్ఎస్ కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో బీసీ బిల్లుపై రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసేదేమిటో ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం
నియోజకవర్గంలో ఏకగ్రీవమైన మేజర్ గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలు, మైనర్ జీపీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ తరఫున ఇప్పటికే ఏకగ్రీవ జీపీలకు రూ.10 లక్షలు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 33 జీపీలు ఏకగ్రీవమయ్యాయని, మరో రెండు రోజుల్లో మరికొన్ని ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కెతావత్ యాదగిరి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, బాగారెడ్డి, అమృతాపూర్ గంగాధర్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >