Posted on 2025-11-28 16:23:39
పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు
అన్నదాన, రక్తదాన శిబిరాలు, ఆసుపత్రుల్లో పాలు, పండ్ల పంపిణీకి సమాయత్తం
వేలాది మందితో దీక్షా దివస్ సభ
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన చారిత్రిక ఘట్టాన్ని పురస్కరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం "దీక్షాదివస్" నిజామాబాద్ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీక్షా దివస్ సభ కోసం బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయం ముస్తాబైనట్లు ఆయన చెప్పారు. భావితరాలకు స్పూర్తినిచ్చే విధంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు.
వేలాది మందితో దీక్షా దివస్ సభ జరుగుతుందని, జిల్లాలోని ప్రతి మండలం నుంచి వంద మందికి పైగా మొత్తం 5నుంచి పది వేల మంది వరకు సభకు హాజరవుతారని భావిస్తున్నట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
దీక్ష దివాస్ సందర్భంగా వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పిస్తామని అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన తరువాత అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తామన్నారు. దీక్షాదివస్ కర్మ, కర్త, క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామన్నారు.ఈ సందర్భంగా అన్నదాన, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పాలుపండ్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా,బాజిరెడ్డి గోవర్దన్,బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్,వి.జి గౌడ్, మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావులతో పాటు జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కారులు,యువకులు తదితరులు పాల్గొంటారని జీవన్ రెడ్డి వెల్లడించారు
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >