| Daily భారత్
Logo




బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పేరిట కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా

News

Posted on 2025-11-27 13:56:51

Share: Share


బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పేరిట కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా

చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం..సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ ఇస్తుందా

నిజామాబాద్ ఎంపీ అరవింద్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రప్రభుత్వంపై విమర్శించారు. గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సదువుకునేటోళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు సర్పంచ్ పదవుల కోసం రిజర్వేషన్లు ఇస్తదా అని ప్రశ్నించారు.

ఇక జిల్లాలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం 13.5 కోట్లు విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు  ధన్యవాదాలు తెలిపారు.

 విడుదల అయిన నిధులతో రాష్ట్ర సర్కార్  ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా యుద్ద ప్రాతిపదికన ఆర్ఓబి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే అర్సపల్లి ఆర్వోబి పనులకు  రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ తొందరగా చేయించాలన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఆర్వోబీ పెండింగ్ ఉందని, దీనిపై ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వీటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం 17 శాతమే రిజిస్ట్రేషన్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ దొంగనాటకం బయటపడిందని దుయ్యబట్టారు. కేవలం కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, మరి ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదన్నారు. కాంగ్రెస్ గుర్తుతో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ ను ప్రజలు

చీత్కరిస్తరని ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఈ సర్పంచ్ ఎన్నికల ఓట్ల కోసమే మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని విమర్శించారు. మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >