Posted on 2025-11-27 03:35:46
పూర్తిగా దగ్ధమైన కంప్యూటర్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు
ఫైర్ సేఫ్టీ సదుపాయం బ్యాంకులో లేకపోవడం వల్లే ఇంత భారీ నష్టం జరిగిందా..?
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని సుభాష్నగర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాంకు మేనేజర్ రంజిత్ మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉందని వెల్లడించారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్హెచ్ఓ హరిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ బ్యాంకులో సైడ్ సేఫ్టీకి గల సంబంధించిన సదుపాయాలు బ్యాంకు నిర్వాహకులు అమర్చారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం సంభవించి కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధం కావడం పట్ల ప్రజల్లో బ్యాంకులంటేనే నమ్మకం కలిగేలా ఉన్న ప్రజలకు ఇలాంటి అగ్నిప్రమాదం వల్ల బ్యాంకులంటే ఏ మేరకు సురక్షితం అనే సందిగ్ధంప్రజల్లో నెలకొంది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >