Posted on 2025-11-26 15:32:13
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇకపై జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలపై వడ్డీలకు, చక్ర వడ్డీలు పేరిట వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచకాలను సహించేది లేదని వారిపై అధికార యంత్రాంగం ఉక్కు పాదం మోపెందుకు చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించింది. నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్టు కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించడం జరిగిందని అన్నారు. వడ్డీ వ్యాపారాలు చేసే వారందరూ తప్పనిసరిగా తగిన అనుమతులు (లైసెన్స్) కలిగి ఉండాలన్నారు. నియమ, నిబంధనలు తు.చ తప్పక పాటించాలని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహించే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >