Posted on 2025-11-26 20:02:13
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇకపై జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలపై వడ్డీలకు, చక్ర వడ్డీలు పేరిట వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచకాలను సహించేది లేదని వారిపై అధికార యంత్రాంగం ఉక్కు పాదం మోపెందుకు చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించింది. నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్టు కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించడం జరిగిందని అన్నారు. వడ్డీ వ్యాపారాలు చేసే వారందరూ తప్పనిసరిగా తగిన అనుమతులు (లైసెన్స్) కలిగి ఉండాలన్నారు. నియమ, నిబంధనలు తు.చ తప్పక పాటించాలని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహించే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >