Posted on 2025-11-25 20:08:35
డైలీ భారత్ ఎఫెక్ట్
ప్రిన్సిపల్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడించడంతోపాటు మరో ముగ్గురు పై వేటు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా చందూర్ మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసులో బాధ్యులపై అధికార యంత్రాంగం చర్యలకు దిగారు. ఇదే ఘటనపై సోమవారం ఉదయం డైలీ భారత్ న్యూస్ లో వార్త రావడంతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ తోపాటు విధుల్లో ఉన్న మరో ముగ్గురిపై వేటు వేసింది. నగరంలోని ధర్మపురి హిల్స్ కు చెందిన గౌస్ (14) ఈ నెల 23న రాత్రి చందూర్ ట్రిమ్స్ పాఠశాల వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. ఒకరోజు ముందే ఇంటి నుంచి వచ్చిన గౌస్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా గుర్తించడంలో విధులు నిర్వహిస్తున్నవారి నిర్లక్ష్యం ఉందని అధికారుల విచారనలో తేలిందని ಜಿಲ್ಲಾ మైనార్టీ సంక్షేమాధికారిని కృష్ణవేణి తెలిపారు. ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్ నవీన్ కుమార్, టీజీటీ స్పెషల్ టీచర్ అతీఫా నస్రీన్, సెక్యూరిటీ గార్డు సాయిలను డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >