Posted on 2025-11-25 15:38:35
డైలీ భారత్ ఎఫెక్ట్
ప్రిన్సిపల్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడించడంతోపాటు మరో ముగ్గురు పై వేటు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా చందూర్ మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసులో బాధ్యులపై అధికార యంత్రాంగం చర్యలకు దిగారు. ఇదే ఘటనపై సోమవారం ఉదయం డైలీ భారత్ న్యూస్ లో వార్త రావడంతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ తోపాటు విధుల్లో ఉన్న మరో ముగ్గురిపై వేటు వేసింది. నగరంలోని ధర్మపురి హిల్స్ కు చెందిన గౌస్ (14) ఈ నెల 23న రాత్రి చందూర్ ట్రిమ్స్ పాఠశాల వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. ఒకరోజు ముందే ఇంటి నుంచి వచ్చిన గౌస్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా గుర్తించడంలో విధులు నిర్వహిస్తున్నవారి నిర్లక్ష్యం ఉందని అధికారుల విచారనలో తేలిందని ಜಿಲ್ಲಾ మైనార్టీ సంక్షేమాధికారిని కృష్ణవేణి తెలిపారు. ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్ నవీన్ కుమార్, టీజీటీ స్పెషల్ టీచర్ అతీఫా నస్రీన్, సెక్యూరిటీ గార్డు సాయిలను డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >