Posted on 2025-11-22 12:19:42
డైలీ భారత్ న్యూస్, వరంగల్:నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ రెండవ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...
ప్రస్తుతం అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అత్యాధునిక పరికరాల తో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాని వరంగల్ కమిషనరేట్ పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి రక్తమరకలు, వేలిముద్రలతో ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాధమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని. ఈ మొబైల్ వాహనం లో విధులు నిర్వహించేందుకు ఆరుగురు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందజేయడం జరిగిందని సీపీ తెలియజేసారు.
ఈ కార్యక్రమం డిసిపి అంకిత్ కుమార్,గుణ శేఖర్, అదనపు డిసిపిలు రవి, ప్రభాకర్, శ్రీనివాస్ తో పాటు ఏసీపీ లు, ఆర్. ఐ లు, ఫింగర్ ప్రింట్ ఇన్స్ స్పెక్టర్లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >