Posted on 2025-11-20 18:08:14
కేజీబీవీ లో care taker ను నియమించాలి, MTS ఇవ్వాలి.
TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాద్ రెడ్డి డిమాండ్
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:విద్యారంగ సమస్యలు,ఉపాధ్యాయుల సమస్యల సేకరణలో భాగంగా టిపిటిఎఫ్ తంగళ్ళపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి సభ్యత్వం సేకరించారు. బీఈడీ.టిటిసి చేసిన తర్వాత డీఎస్సీలో పాసై అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత టెట్ రాయమనడం అనేది సరైన విధానం కాదని, దాని నుండి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని . విద్యారంగ సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను పక్క తోవ పట్టించడానికె ప్రభుత్వాలు టెట్ తీసుకొస్తున్నాయని. ప్రభుత్వాలు మారిన పాలకుల విధానాలలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని అనేక వ్యత్యాసాలతో పలు యాజమాన్యాలలో వివిధ పేర్లతో చలామణి అవుతున్నా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిని ఒకే గొడుగు కిందికి చేర్చి కామన్ స్కూల్ విధానం, శాస్త్రీయ విద్యా విధానం కొరకు పోరాటం చేయవలసిన అవసరం ఉందని దుమాల రమానాధ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐదు డిఏ లు పెండింగ్ లో ఉన్నాయి, పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంలో పాత ప్రభుత్వాలు చేసిన విధ్వంసాలను సరి చేయవలసింది పోయి కొత్త ప్రభుత్వం మరిన్ని కొత్త సమస్యలను కొని తెచ్చిపెడుతుంది. పాఠశాలల ను పర్యవేక్షణ చేయడానికి ఉపాధ్యాయ బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారి పోయే ప్రమాదం ఉంది కావున వాటిని వెంటనే రద్దు చేయాలని, Kgbv పాఠశాల లకు care taker ను నియమించాలని, kgbv సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు, రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ commitee కన్వీనర్ బుస రాజేందర్, TPTF మండల అధ్యక్షులు బండి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి దామెరశెట్టి మధుసూదన్, శ్రీనివాస్ రాజు, బొల్లి పర్షరాములు, పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >