Posted on 2025-11-18 11:31:34
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదాయపన్ను శాఖ భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రముఖ హోటల్ వ్యాపారులకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల ఇండ్లతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా శోధనలు జరుపుతున్నారు. నగరంలో కోట్ల రూపాయల టర్నోవర్తో పనిచేస్తున్న ప్రముఖ హోటల్ చైన్లు పిస్తా హౌస్, షాహ్ ఘౌస్ సహా మరికొన్ని పెద్ద వ్యాపార సంస్థలు ఈ సోదాల పరిధిలోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల విలువైన వ్యాపారం జరిగే ఈ సంస్థల ఖాతాలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, షాహ్ ఘౌస్ యజమానుల సహోదరుల ఇళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇవి యాఖుత్పుర ప్రాంతంలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడులపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >