Posted on 2025-11-17 20:58:29
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 (ICT-1) దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాలపై ఐసీటీ తాజా తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు.
నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్ఆర్మ్స్, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. హసీనాకు, దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్కు మధ్య జరిగిన సంభాషణలను కూడా ఆయన చదివి వినిపించారు. ప్రజలను రజాకార్లుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హింసను హసీనా రెచ్చగొట్టారని, ఆమెపై అభియోగాల నిర్ధారణకు తగిన ఆధారాలున్నాయని చెప్పారు. జూలై 14న మీడియా సమావేశంలో కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.
విద్యార్థుల ఆందోళనతో పదవీచ్యుతురాలైన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ వీడి భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఒక రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. తనపై తీర్పు నేపథ్యంలో కూడా... కోర్టు ఏ తీర్పునిచ్చినా తన ప్రాణం ఉన్నంతవరకూ ప్రజల కోసమే పనిచేస్తానని, దేశం కోసం తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని తెలిపారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >