| Daily భారత్
Logo




బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరణ శిక్ష.. ఐసీటీ తీర్పు

News

Posted on 2025-11-17 16:28:29

Share: Share


బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరణ శిక్ష.. ఐసీటీ తీర్పు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్  మాజీ ప్రధాని షేక్ హసీనా ను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 (ICT-1) దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాలపై ఐసీటీ తాజా తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు.

నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్‌ఆర్మ్స్‌, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. హసీనాకు, దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్‌కు మధ్య జరిగిన సంభాషణలను కూడా ఆయన చదివి వినిపించారు. ప్రజలను రజాకార్లుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హింసను హసీనా రెచ్చగొట్టారని, ఆమెపై అభియోగాల నిర్ధారణకు తగిన ఆధారాలున్నాయని చెప్పారు. జూలై 14న మీడియా సమావేశంలో కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.

విద్యార్థుల ఆందోళనతో పదవీచ్యుతురాలైన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ వీడి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఒక రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. తనపై తీర్పు నేపథ్యంలో కూడా... కోర్టు ఏ తీర్పునిచ్చినా తన ప్రాణం ఉన్నంతవరకూ ప్రజల కోసమే పనిచేస్తానని, దేశం కోసం తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని తెలిపారు.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >