Posted on 2025-11-14 13:38:56
డైలీ భారత్, సిరిసిల్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల్లో ఈరోజు ఉపాధ్యాయ – తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి విద్యార్థుల విద్యాభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రత్యేకించి 10వ తరగతి విద్యార్థుల స్టడీ హవర్స్, పరీక్షల సిద్ధత, హాజరు పరిరక్షణపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.
తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద గారితో పాటు ఉపాధ్యాయులను కలిసి పాఠశాల విద్యా కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల మధ్యాహ్న భోజనశాల మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఇదే సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమాన్ని పర్యవేక్షించి, విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్రను పోషించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >