Posted on 2025-11-14 18:02:32
డైలీ భారత్, దమ్మపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈరోజు ప్రధానోపాధ్యాయులుగా ఆరే మధు వ్యవహరించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నెహ్రూ గారికి బాలల అంటే చాలా ఇష్టం ఆ సందర్భంగా నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా బాలల దినోత్సవం జరుపుకోవడం జరిగింది అని తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులు కావున వారికి స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం ద్వారా భవిష్యత్తులో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు నేడు ఉపాధ్యాయులుగా వారు ఎంచుకున్న విషయంలో పాఠ్యాంశాలు బోధించడం జరిగింది ఒక కొత్త అనుభూతిని పొందినట్లుగా నేటి ఉపాధ్యాయులు వారి అనుభవాలను తెలియజేశారు ఈరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన వారి నుండి ప్రతి సబ్జెక్టు నుండి ఒకరిని ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకొని వారికి బహుమతులు అందించడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటుగా నేటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >