| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

సిరిసిల్ల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

డైలీ భారత్, సిరిసిల్ల:జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు చెందిన 9వ తరగతి విద్యార్థి ధనుష్ SGF (School Games Federation) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.

ఈ పోటీలు నల్గొండ జిల్లా సాగర్ రోడ్‌లోని డాన్ బాస్కో అకాడమీలో నవంబర్ 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు జరుగనున్నాయి.

రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి విద్యార్థి ధనుష్ ఈరోజు బయలుదేరి వెళ్ళాడు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శారదా మేడం, మైలారం తిరుపతి, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

Previous శీర్షిక: బాలల దినోత్సవం
Next పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి, అమలు చేయాలి!
ADVERTISEMENT