Posted on 2025-11-13 13:04:11
డైలీ భారత్, సిరిసిల్ల:జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు చెందిన 9వ తరగతి విద్యార్థి ధనుష్ SGF (School Games Federation) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ పోటీలు నల్గొండ జిల్లా సాగర్ రోడ్లోని డాన్ బాస్కో అకాడమీలో నవంబర్ 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు జరుగనున్నాయి.
రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి విద్యార్థి ధనుష్ ఈరోజు బయలుదేరి వెళ్ళాడు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శారదా మేడం, మైలారం తిరుపతి, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >