Posted on 2025-11-10 16:56:11
ఎర్రకోట వద్ద ఘటనలో పలువురు దుర్మరణం
మరో 24 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగానే పేలిన కారు
పహల్గామ్ దాడి మరువక ముందే మరో విషాదం
రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఓ కారు బాంబు పేలుడులో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ (సీపీ) మీడియాకు వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6:52 గంటల సమయంలో ఎర్రకోట వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. రెడ్ లైట్ పడటంతో ఓ కారు నెమ్మదిగా వచ్చి ఆగిందని, అది ఆగుతున్న సమయంలోనే భారీ శబ్దంతో పేలిపోయిందని వివరించారు.
పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయని సీపీ తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న అనేక వాహనాలు ధ్వంసం కాగా, కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని సీపీ వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయని తెలిపారు.
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >