Posted on 2025-11-06 20:03:23
డైలీ భారత్, వేములవాడ:వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ తనిఖీలను నిర్వహిస్తుండగా, రహదారి భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ టిప్పర్ వాహనంలో డస్ట్ను నిర్లక్ష్యంగా తరలింపు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనివల్ల రహదారిపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు
ఈ ఘటనపై MV యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు
ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తాము.
అలాగే, భారీ వాహనాల్లో డస్ట్, గ్రావెల్, కంకర వంటి నిర్మాణ సామగ్రి తరలించే సందర్భాల్లో వాహనాన్ని పూర్తిగా కవర్లు లేదా షీట్లు ఉపయోగించి మూసివేయాలి
రోడ్డు పైకి, ప్రజలపై ధూళి ఎగరకుండా తగు జాగ్రత్తలు తప్పనిసరి
నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం
చివరిగా, డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు రహదారి భద్రత పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజల ఆరోగ్యం, వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించాలని అదనపు ఎస్పీ కోరారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >