Posted on 2025-11-06 14:16:36
10,000లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వ్యవసాయ ఏఈఓ గాడి పెళ్లి సందీప్
డైలీ భారత్, మహబూబాబాద్:చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా మంజూరు కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏఈఓ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గురువారం జరిగింది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని అనే పురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14 వ తేదీన మరణించాడు. దీంతో నామినీగా ఉన్న రైతు కుమారుడు రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన అన్ని ధ్రువీకరణ పత్రాలతో మరిపెడ అగ్రికల్చర్ కార్యాలయంలో బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపెళ్లి సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద రూ. 20 వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేస్తానని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
అధికారికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేని సదర్ దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్లోని ఏసీబీ అధికారులను సంప్రదించి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా దరఖాస్తుదారుల నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేరస్తుడిని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఆయనతో పాటుగా ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు, శేఖర్, ఏసీబీసీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మరిపెడలోని నేరస్తుడి బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >