Posted on 2025-11-05 12:36:57
8 కిలోమీటర్ల కాలినడక
కనకగిరి గుట్టల్లో కొలువై ఉన్న వీరభద్రుని కి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ తదితరులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రకృతి ప్రేమికుడిగా మారి బుధవారం చండ్రుగొండ మండలం, బెండాలపాడు గ్రామ శివారులోని (కనకాద్రి) గుట్టలను సందర్శించారు. స్థానిక బెండాలపాడులోని ఆదివాసీ గిరిజనుల తో కలిసి సాధారణ వ్యక్తిగా ఉదయం ఏడు గంటల నుండి అడవిలోకి, కాలినడక తో కనకాద్రి పకృతి అందాలను ఆస్వాదించుకుంటూ, గుట్టలపై గల కాకతీయుల కాలంలో కట్టిన వీరభద్రుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట పై కాకతీయులు నిర్మించిన కట్టడాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కట్టడాలను చూస్తే గర్వంగా ఉందని మన పూర్వీకుల దూర దృష్టి కి నిదర్శనమే ఈ అద్భుత నైపుణ్యంతో కట్టిన కట్టడాలు, ప్రాచీన కాల దేవాలయంలను సం రక్షించుకోవడం మన బాధ్యతని, ఈ సంపదను రాబోయే తరాలకు కూడా మనం అందించాలని అని అన్నారు.. త్వరలోనే ఈ అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దు కోబోతుందని ఆనందం వ్యక్తం చేశారు
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >