| Daily భారత్
Logo




కార్తీక పౌర్ణమి సందర్భంగా లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

News

Posted on 2025-11-05 14:13:15

Share: Share


కార్తీక పౌర్ణమి సందర్భంగా లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి సందర్భంగా బాల్కొండ మండలం లింబాద్రిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని బుధవారం జాగృతి అధ్యక్షురాలు కవితప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీంగల్ మండలంలోని లింబాద్రి స్వామి ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుందన్నారు. చాలా పవర్ ఫుల్ దేవుడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని ఆమె అన్నారు. నిజానికి లింబాద్రి ఆలయం కాదు, నింబాద్రి. చాలా మహిమ గల దేవుడు అని ఆమె పేర్కొన్నారు. వేప చెట్లు ఉన్నాయని నింబాద్రి అంటారు. కాలక్రమేణా లింబాద్రిగా పేరు వచ్చిందన్నారు. ఈ దేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో కీలకమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు. ఈ మండలానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారని తెలియజేశారు. మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఈ  ప్రాంతం వారే అని అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే.. రూలింగ్ పార్టీదే  నడుస్తోందన్నారు. అయినా సరే రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. మక్కలు 80 శాతం కొన్న తర్వాత ఇప్పుడు కాంటా పెడుతున్నారు. ఇది దారుణం, అన్యాయం అని మండిపడ్డారు. తడిసిన వరి కూడా కొంటలేరు. కొంటామని కూడా చెప్పటం లేదన్నారు. ఇటీవల తాను నిర్వహించిన జనంబాట కార్యక్రమంలో భాగంగా నవిపేట మండలం యంచ గ్రామానికి వెళ్లిన తర్వాత కలెక్టర్  ఆసందర్శించారని తెలిపారు ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. 

అలాగే అన్ని చోట్లకు వెళ్లాలని కోరారు. ఈ ప్రాంతంలోని కొన్ని చెక్ డ్యామ్ లు డ్యామేజ్ అవటంతో బాల్కొండలో పంట పొలాలు మునిగాయని, వారికి పంట నష్టం ఇస్తామని విమర్శించారు ప్రభుత్వం ధైర్యం చెప్పటం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీస్తలేవన్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే  ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. కేసీఆర్ లక్ష్మీ నరసింహా స్వామి భక్తుడు. గతంలో లింబాద్రి స్వామి వారికి రూ. 5 కోట్లు పేర్కొన్నారు కేటాయించారని పేర్కొన్నారు. దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నాం. ఐతే మహిళలకు టాయిలెట్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం పూర్తి కావటానికి రూ. 20 లక్షలు అవసరం. ప్రభుత్వం వాటిని కేటాయించాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్  ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు.


Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >