| Daily భారత్
Logo




కార్తీక పౌర్ణమి సందర్భంగా లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

News

Posted on 2025-11-05 14:13:15

Share: Share


కార్తీక పౌర్ణమి సందర్భంగా లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి సందర్భంగా బాల్కొండ మండలం లింబాద్రిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని బుధవారం జాగృతి అధ్యక్షురాలు కవితప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీంగల్ మండలంలోని లింబాద్రి స్వామి ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుందన్నారు. చాలా పవర్ ఫుల్ దేవుడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని ఆమె అన్నారు. నిజానికి లింబాద్రి ఆలయం కాదు, నింబాద్రి. చాలా మహిమ గల దేవుడు అని ఆమె పేర్కొన్నారు. వేప చెట్లు ఉన్నాయని నింబాద్రి అంటారు. కాలక్రమేణా లింబాద్రిగా పేరు వచ్చిందన్నారు. ఈ దేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో కీలకమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు. ఈ మండలానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారని తెలియజేశారు. మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఈ  ప్రాంతం వారే అని అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే.. రూలింగ్ పార్టీదే  నడుస్తోందన్నారు. అయినా సరే రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. మక్కలు 80 శాతం కొన్న తర్వాత ఇప్పుడు కాంటా పెడుతున్నారు. ఇది దారుణం, అన్యాయం అని మండిపడ్డారు. తడిసిన వరి కూడా కొంటలేరు. కొంటామని కూడా చెప్పటం లేదన్నారు. ఇటీవల తాను నిర్వహించిన జనంబాట కార్యక్రమంలో భాగంగా నవిపేట మండలం యంచ గ్రామానికి వెళ్లిన తర్వాత కలెక్టర్  ఆసందర్శించారని తెలిపారు ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. 

అలాగే అన్ని చోట్లకు వెళ్లాలని కోరారు. ఈ ప్రాంతంలోని కొన్ని చెక్ డ్యామ్ లు డ్యామేజ్ అవటంతో బాల్కొండలో పంట పొలాలు మునిగాయని, వారికి పంట నష్టం ఇస్తామని విమర్శించారు ప్రభుత్వం ధైర్యం చెప్పటం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీస్తలేవన్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే  ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. కేసీఆర్ లక్ష్మీ నరసింహా స్వామి భక్తుడు. గతంలో లింబాద్రి స్వామి వారికి రూ. 5 కోట్లు పేర్కొన్నారు కేటాయించారని పేర్కొన్నారు. దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నాం. ఐతే మహిళలకు టాయిలెట్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం పూర్తి కావటానికి రూ. 20 లక్షలు అవసరం. ప్రభుత్వం వాటిని కేటాయించాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్  ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు.


Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >