| Daily భారత్
Logo




కామాంధుల చెరలో పడ్డ ఓ వివాహిత..

News

Posted on 2025-11-03 20:46:48

Share: Share


కామాంధుల చెరలో పడ్డ ఓ వివాహిత..

బయటకు చెప్పుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక సంవత్సరం పాటు నరక వేదన

వివాహితకు డెంటల్ డాక్టర్ అతని స్నేహితుడు రియాల్టర్ వేదింపులు

కమిషనర్ కు  ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే వాట్సాప్ కాల్ చేసిన ప్రబుద్ధులు

షాక్ గురైన సిపి..వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించిన పోలీసు కమిషనర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో, చదువు కోసమో బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండాపోతుంది. తాజాగా నిజామాబాద్ లో ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువతి తన వివాహానికి ముందు ట్రావెల్ కార్యాలయంలో రిసెప్షనిస్టుగా పని చేసేది. ఏడాది క్రితం వివాహం జరుగగా భర్త కోరిక మేరకు ప్రైవేట్ జాబ్ ను వదులుకుని ఇంటి వద్దే ఉంటుంది. తాను ట్రావెల్ ఏజంట్ కార్యాలయంలో పని చేసే చోట యజమాని భామ్మర్థి శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని యువతితో మాటలు కలిపాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అప్పట్లో వెకిలి చేష్టలు చేసేవాడు. ఎక్కడ ఈ విషయం చెబితే యజమాని తన ఉద్యోగం తీసేస్తాడేమోనని, ఇంట్లో చెబితే ఉద్యోగం మానేయాలని కుటుంబ సభ్యులు చెబుతారేమోనని యువతి భయపడి అంతర్గతంగానే కుమిలిపోయింది. అదే సమయంలో నగరంలో డాక్టర్ల కాలనీగా పేరున్న ఖలీల్ వాడికి చెందిన డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్న మరో వ్యక్తి టూరిస్టు వీసా కోసం ట్రావెల్ కార్యాలయంకు వచ్చి యువతి నంబర్ తీసుకున్నాడు. అతను కూడా యువతిని తరుచుగా వేదించడం ప్రారంభించాడు. ఒక వైపు రియాల్టర్, మరో వైపు డెంటల్ డాక్టర్ వేదింపులు భరించలేక ఏడాది క్రితం ఉద్యోగం మానేసి వివాహం చేసుకుంది. 

ఇటీవల కాలంలో పెళ్లయిన వివాహితకు రియల్ ఎస్టేట్ వ్యాపారి, దంత వైద్యుడి వేదింపులు ఎక్కువయ్యాయి. న్యూడ్ కాల్ చేస్తే రూ.5 వేలు ఇస్తామని, గెస్ట్ హౌజ్ కు వస్తే రూ.10 వేలు ఇస్తామని వాట్సాప్ కాల్, వీడియో కాల్స్ చేసి వేదించడం మొదలుపెట్టారు. నగరంలోని స్టార్ హోటల్ ను బుక్ చేసామని రావాలని కోరుతూ కాల్స్ చేసి వేదింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పోలీసు ప్రజావాణి సందర్భంగా సదరు వివాహిత పోలీసు కమిషనర్ కు తన గోడును వెళ్లబోసుకుంది. అదే సమయంలో వివాహితకు వాట్సాప్ కాల్ రాగా స్వయంగా పరిశీలించిన పోలీసు కమిషనర్ ఉన్నఫళంగా కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోను ఆదేశించారు.

Image 1

మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి

Posted On 2025-11-13 10:03:28

Readmore >
Image 1

టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

Posted On 2025-11-12 19:13:27

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి

Posted On 2025-11-12 19:12:07

Readmore >
Image 1

పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం

Posted On 2025-11-12 19:10:42

Readmore >
Image 1

అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు

Posted On 2025-11-12 19:09:07

Readmore >
Image 1

నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?

Posted On 2025-11-12 13:27:18

Readmore >
Image 1

సీఏ లో ఉత్తీర్ణత సాధించిన బొడ్డు సతీష్ ఆత్మీయ సత్కారం

Posted On 2025-11-12 08:51:49

Readmore >
Image 1

JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం

Posted On 2025-11-12 08:50:16

Readmore >
Image 1

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి

Posted On 2025-11-12 08:48:19

Readmore >
Image 1

ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Posted On 2025-11-12 08:47:02

Readmore >